Thursday, March 28, 2024

హుజురాబాద్ పాదయాత్రలో ఈటల కీలక వ్యాఖ్య

హుజురాబాద్‌ ఉప ఎన్నికలో గెలుపే లక్ష్యంగా మాజీ మంత్రి, బీజేపీ నేత ఈటల రాజేందర్ ప్రజా దీవెన యాత్ర పేరుతో పాదయాత్రను కొనసాగిస్తున్నారు. వర్షాన్ని సైతం లెక్క చేయకుండా ఆయన గురువారం ఇల్లంతకుంట మండలంలోని మర్రివానిపల్లె, సీతంపేటలో పర్యటించారు. మర్రివానిపాలెం నుంచి నడుచుకుంటూ సీతంపేటకు చేరుకున్నారు. వర్షంలోనే పలు చోట్ల ప్రసంగించారు. తాను రాజీనామా ఎందుకు చేయాల్సి వచ్చిందనే దానిపై కీలక వ్యాఖ్యలు చేశారు. హుజురాబాద్ ఎమ్మెల్యే పదవికి తనంతతానుగా రాజీనామా చేయలేదని ఈటల రాజేందర్ అన్నారు. టీఆర్ఎస్ అధిష్ఠానం రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తేనే తాను అలా చేసినట్లు తెలిపారు. అసలు టీఆర్ఎస్ పార్టీని తాను వదలలేదని, వదిలేలా వాళ్లే చేసుకున్నారని వ్యాఖ్యానించారు. అయిన వాళ్లకు ఆకుల్లో, కాని వాళ్లకు కంచాల్లో కేసీఆర్ పెడుతుంటారని ఈటల విమర్శించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement