Thursday, April 25, 2024

హైదరాబాద్ లో ఈటల.. భవిష్యత్ కార్యచరణ ప్రకటన ఎప్పుడు?

బీజేపీలో చేరేందుకు సిద్ధమవుతున్న మాజీ మంత్రి ఈటల రాజేందర్  ఢిల్లీ పర్యటన ముగించుకుని హైద్రాబాద్ చేరుకున్నారు. ఢిల్లీలో బీజేపీ నేత‌ల‌తో పార్టీలో చేరికపై చ‌ర్చించిన ఈటల.. ప‌ర్య‌ట‌న ముగించుకుని ఆయ‌న‌ హైదరాబాద్ వచ్చారు. శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో‌ ఈటలకు ఆయ‌న అనుచ‌రులు, మ‌ద్ద‌తుదారులు ఘనస్వాగతం పలికారు. ఈట‌ల రాజేంద‌ర్ వెంట మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్‌రెడ్డి కూడా ఉన్నారు. వీరివురికి అభిమానులు ఘనంగా స్వాగతం పలికారు. రేపు ఈటల మీడియా సమావేశం నిర్వహించే అవకాశం ఉంది. ఢిల్లీ పర్యటన వివరాలు, బీజేపీలో చేరికపై ప్రకటన చేసే అవకాశం ఉంది.

నాలుగు రోజులపాటు ఈటల ఢిల్లీలోనే గడిపారు. అక్కడ బీజేపీ ముఖ్య నేతలను కలిసి తనకు జరిగిన అన్యాయం, పార్టీలో చేరికపై చర్చరించారు. బీజేపీలో ఈటలు తగిన ప్రాధాన్యత ఉంటుందని ఆగ్రనాయకత్వం హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈట‌ల బీజేపీలో చేరేందుకు ముహూర్తం ఖ‌రారైన‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. ఈ నెల 8 లేదా 9న ఆయ‌న బీజేపీలో చేరనున్నట్లు తెలుస్తోంది. ఈటలతో పాటు ప‌లువురు నేత‌లు బీజేపీలో చేర‌నున్న‌ట్లు తెలుస్తోంది.

https://twitter.com/Ashi_IndiaToday/status/1400309818464772102
Advertisement

తాజా వార్తలు

Advertisement