Wednesday, April 17, 2024

అగ్నిప్రమాద మృతులకు కెసిఆర్ సంతాపం – రూ.5లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటన

సికింద్రాబాద్​లోని స్వప్నలోక్​ కాంప్లెక్స్​లో గురువారం రాత్రి అగ్నిప్రమాదం జరిగి ఆరుగురు మృతిచెందారు. ఈ అగ్నిప్రమాదంపై సీఎం కేసీఆర్‌ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అగ్ని ప్రమాదంలో ప్రాణనష్టంతో పాటు పలువురు గాయపడటం విచారకరమన్నారు. ఈ సందర్భంగా మృతుల కుటుంబాలకు, క్షతగాత్రులకు సంతాపం తెలిపారు. మృతుల కుటుంబాలకు రూ.5లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. గాయపడిన వారికి మెరుగైన వైద్య సేవలు అందించాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. మృతుల కుటుంబాలతో పాటు క్షతగాత్రులకు రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. క్షేత్ర స్థాయిలో ఉండి పరిస్థితులను పరిశీలించాలని.. అవసరమైన చర్యలు చేపట్టాలని మంత్రులు మహమూద్‌ అలీ, తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌కు సూచించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement