Thursday, March 28, 2024

ఆర్థిక సమస్యలు.. రైలు ముందు దూకేసి ప్రాణాలు తీసుకున్న రిటైర్డ్​ ఆర్మీ దంపతులు

రిటైర్డ్ ఆర్మీ మ్యాన్ తన భార్యతో కలిసి రైలు ముందు దూకేసి ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటన తెలంగాణ రాష్ట్రం  సికింద్రాబాద్ సమీపంలోని బోలారంలో జరిగింది. ఆర్థిక సమస్యలే వారి ఆత్మహత్యకు కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు. బోలారంలో రైలు పట్టాలపై భార్యాభర్తల మృతదేహాలు లభ్యమయ్యాయి. మృతులు సికింద్రాబాద్‌లో ఆర్మీలో క్లర్క్‌గా పనిచేస్తున్న వై.కొండయ్య (55), అతని భార్య భూలక్ష్మి (50)గా పోలీసులు గుర్తించారు.

నిన్నటి నుంచి కనిపించకుండా పోయిన దంపతులు శవాలుగా కనిపించారు. కాగా, వారి కుమార్తె, ఓ పోలీసు కానిస్టేబుల్ సాయంతో వారు కనిపించకుండా పోయారన్న ఫిర్యాదును ఇవ్వడానికి పోలీసులను ఆశ్రయించారు. కాగా, మంగళవారం ఉదయం రైలు పట్టాలపై రెండు మృతదేహాలను గుర్తించిన రైల్వే పోలీసులు స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. తమ తల్లి,  తండ్రి కొన్ని ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్నారు, డిప్రెషన్​కు గురయ్యే వారు ఆత్మహత్య చేసుకున్నట్టు మృతుడి కూతురు పోలీసులకు తలిపింది. కేసు నమోదు చేసి తదుపరి విషయమై దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement