Friday, April 19, 2024

బిజెపి మత విద్వేషాలకు బలి కావద్దు: మంత్రి ఎర్రబెల్లి పిలుపు

హిందూ ముస్లింల మధ్య చిచ్చు పెట్టి మత విద్వేషాలను రెచ్చగొట్టడం బీజేపీ ప్రధాన లక్ష్యమని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. మహబూబాబాద్ జిల్లా పాలకుర్తి నియోజకవర్గం తొర్రూరులో మంత్రి రంజాన్ సందర్భంగా ముస్లిం సోదరులతో కలిసి మసీదులో ప్రార్థనలు చేశారు. అనంతరం దుబ్బ తండ లో దుర్గమ్మ గుడికి భూమి పూజ చేసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ, దేశంలో బీజేపీ అధికార దాహంతో ప్రజలను మతాల పేరుతో విడదీసి చిచ్చుపెట్టి పరిపాలన సాగిస్తోంది అని మండిపడ్డారు. బిజెపి కుట్రలకు మత విద్వేషాలకు ప్రజలు బలి కావద్దని ఆయన చెప్పారు. దేశంలో దశాబ్దాలుగా కలిసిన ఉన్న విధంగానే హిందూ, ముస్లింలు అన్నదమ్ముల్లా కలిసి ఉందామని మంత్రి అన్నారు. మసీదు అభివృద్ధి కోసం రూ.10 లక్షల రూపాయలతో పలు కార్యక్రమాలను చేపడతామని ముస్లిం సోదరుల చప్పట్ల మధ్య మంత్రి ప్రకటించారు.

అనంతరం మంత్రి తొర్రూర్ సమీపంలోని దుబ్బ తండాలో దుర్గమ్మ గుడికి శంకుస్థాపన, భూమి పూజ చేశారు. తండాలో త్వరలోనే దుర్గమ్మ గుడి నిర్మాణాన్ని పూర్తి చేసి పండుగ చేసుకుందామని మంత్రి తండా వాసుల హర్షధ్వానాల మధ్య ప్రకటించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement