Wednesday, April 24, 2024

గెలుపు సంబరాలు చేసుకోవద్దని ఈసీ ఆదేశాలు

కరోనా వైరస్ ప్రబలుతున్న నేపథ్యంలో ఎన్నికల కౌంటింగ్ సాగుతున్న రాష్ట్రాల్లో గెలుపు సంబరాలపై ఈసీ దృష్టి సారించింది. ఆయా రాష్ట్రాల ముఖ్య కార్యదర్శులు ఈ విజయోత్సవాలపై చర్యలు తీసుకొని, ప్రజలు గుంపులు కట్టడాన్ని నిరోధించాలని ఆదేశాలు జారీ చేసింది. కౌంటింగ్ జరుగుతున్న రాష్ట్రాల్లో ఇప్పటికే పలు పార్టీల గెలుపు ఖరారు కావడంతో, మద్దతుదారులు సంబరాలు చేసుకుంటున్నారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో విజయోత్సవాలపై ఎన్నికల కమిషన్ నిషేధం విధించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement