Thursday, April 25, 2024

ఇదేంద‌య్యా ఇది.. ఒక సైకిల్ పై.. ఎనిమిది మంది పిల్ల‌లు

సోష‌ల్ మీడియా పుణ్య‌మా అని ఏ మూల ఏ కొత్త విష‌యం జ‌రిగినా క్ష‌ణాల్లో వైర‌ల్ గా మారిపోతోంది. ఇప్పుడు అలాంటి వార్త ఒక‌టి వైర‌ల్ అవుతోంది. ఓ ఫొటోలో ఓ వ్యక్తి సైకిల్ ఎక్కి కనిపిస్తున్నాడు. సైకిల్ ఎక్కడంలో వింతేముంది అనుకుంటున్నారా. అం . ఆ సైకిల్ పై ఎనిమిది మంది పిల్లలను ఎక్కించుకోవడం విశేషం. నమ్మసక్యంగా లేకపోయినా ఇది నిజం. ఒక సైకిల్ పై ఇద్దరు కంటే ఎక్కువ ఎక్కలేరు. అలాంటిది ఏకంగా ఎనిమిది మంది పిల్లలను ఎక్కించుకోవడం అంటే మాటాలా. దీంతో… దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు వైరల్ గా మారాయి.

ఈ వీడియోని జైకీ యాదవ్ అనే వ్యక్తి సోషల్ మీడియాలో షేర్ చేశాడు. దీనికి ఇప్పటి వరకు 150వేల వ్యూస్ రావడం విశేషం. ఇక ఈ వీడియోకి నెటిజన్ల రియాక్షన్ అయితే మామూలుగా లేదు. పిల్లలు సైకిల్ మీద ఎక్కిన విదానం చూస్తే ఎవరైనా షాక్ అవ్వాల్సిందే. ముందు, వెనక… ఒకరి ముందు మరొకరు , సైకిల్ తొక్కుతున్న వ్యక్తి భుజాలపై కూడా ఎక్కడం గమనార్హం. ఇంత మంది అతని పిల్లలేనా అని కొందరు నెటిజన్లు కామెంట్ చేయగా…. ప్రపంచ జనాభా 800 బిలియన్లకు చేరుకున్నారు అంటే… ఇదే కారణం కావచ్చు అంటూ మరికొందరు కామెంట్ చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement