Sunday, March 24, 2024

భార‌త్ లో రిప‌బ్లిక్ డే వేడుక‌లు.. గెస్ట్ గా ఈజిప్టు అధ్య‌క్షుడు అబ్దెల్ ఫ‌తా అల్ సిసి.. ఆహ్వానించిన మోడీ

ఈజిప్టు అధ్యక్షుడు అబ్దెల్ ఫ‌తా అల్ సిసి భార‌త్ లో జ‌న‌వ‌రి 26న జ‌ర‌గ‌నున్న రిప‌బ్లిక్ డే వేడుక‌ల‌కు ముఖ్య అతిథిగా రానున్నారు. దీనిపై కేంద్ర విదేశాంగ శాఖ మంత్రిత్వ శాఖ ఓ ప్రకటన చేసింది. అరబ్ రిపబ్లిక్ ఆఫ్ ఈజిప్ట్ దేశాధ్యక్షుడు భారత రిపబ్లిక్ డే ఉత్సవాలకు హాజరు కావడం ఇదే ప్రథమం అని తెలిపింది. భారత రిపబ్లిక్ డే సందర్భంగా జరిగే వేడుకలకు చీఫ్ గెస్టుగా రావాలంటూ ఈజిప్టు అధ్యక్షుడికి ప్రధాని నరేంద్ర మోడీ లాంఛనంగా ఆహ్వానం పంపారు. ఈ ఆహ్వాన పత్రాన్ని భారత విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ గత అక్టోబరు 16న స్వయంగా అల్ సిసీకి అందించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement