Thursday, April 25, 2024

Breaking: ఎంపీ నామా నాగేశ్వరరావుకు ఈడీ షాక్

టీఆర్ఎస్ పార్టీ ఎంపీ నామా నాగేశ్వరరావుకు ఈడీ షాకిచ్చింది. రూ.80.65కోట్ల విలువైన స్థిర, చర ఆస్తులను ఈడీ జప్తు చేసింది. రాంచీ ఎక్స్ ప్రెస్ హైవే నిర్మాణంలో అవకతవకలు చోటుచేసుకున్నట్లు నమోదైన కేసులో ఎంపీ నామా నాగేశ్వరరావు ఆస్తులను జప్తు చేసినట్లు ఈడీ వెల్లడించింది. ఇప్పటికే ఈ కేసులో రూ.73.74కోట్ల విలువైన ఆస్తులను జప్తు చేసినట్లు వెల్లడించింది. ప్రాజెక్టు కింద బ్యాంకు నుంచి రుణం తీసుకొని రూ.361.29 కోట్లు దారిమళ్లించినట్లు ఈడీ కేసు నమోదు చేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement