Thursday, April 25, 2024

స్కిల్ ఇన్‌ఫ్రా చైర్మన్ నిఖిల్ గాంధీపై ఈడీ రైడ్స్.. 30 కోట్ల విలువైన వజ్రాలు, ఆభరణాలు స్వాధీనం

స్కిల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ నిఖిల్ గాంధీపై ఎన్ ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) సోదాలు కొనసాగుతున్నాయి. నిఖిల్ లాకర్ల సోదాల్లో భాగంగా దాదాపు రూ.30 కోట్ల విలువైన వజ్రాలు సహా ఆభరణాలను కనుగొన్నారు. పదిహేను రోజులుగా దక్షిణ ముంబై, సెంట్రల్ ముంబైలోని రెండు బ్యాంకుల్లో గాంధీ, అతని బంధువులకు చెందిన లాకర్లపై ED అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారని అధికార వర్గాలు తెలిపాయి.

రెండు బ్యాంకుల్లోని 10 లాకర్ల నుంచి ఈడీ ఆభరణాలను స్వాధీనం చేసుకుంది. తమకు అందిన సమాచారం ప్రకారం.. మరికొన్ని లాకర్లు తెరవాల్సి ఉందని అధికారులు తెలిపారు. నిఖిల్ గాంధీకి చెందిన సంస్థ SKIL ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, IL&FS ఫైనాన్షియల్ (IFIN) నుండి రుణాలు తీసుకుంది. అది తరువాత నిరర్థక ఆస్తిగా (NPA) మారింది. నవీ ముంబై స్పెషల్ ఎకనామిక్ జోన్ (SEZ)లో నిఖిల్ గాంధీకి దాదాపు 15% వాటా ఉన్నట్టు అధికారులు తెలిపారు.

ఎన్‌ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ నిఖిల్ గాంధీకి చెందిన దాదాపు రూ.600–700 కోట్ల విలువైన చర, స్థిరాస్తులను గుర్తించింది. వీటిని ఎప్పుడైనా జతచేయవచ్చు. ఇంతకుముందు ED నిందితుల యొక్క అనేక ఆస్తులను అటాచ్ చేసింది.2019లో రుణ-మోసం కేసులో ఆరోపణలు రావడంతో సోదాలు కూడా నిర్వహించారు. అధికారులు ఇంకా కొన్ని లాకర్ల విషయాలను పరిశీలిస్తున్నారని, స్వాధీనం చేసుకున్న సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికార వర్గాలు తెలిపాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement