Thursday, April 25, 2024

హైద‌రాబాద్ లోని 15 ప్రాంతాల్లో ఈడీ సోదాలు

ఎన్‎ఫోర్స్‎మెంట్ డైరెక్టరేట్ అధికారులు హైదరాబాద్ లో విస్తృతంగా సోదాలు చేస్తున్నారు. జువెన్ ఫార్మా కంపెనీలో ఈడీ అధికారులు తనిఖీలు చేపట్టిన‌ట్లు తెలుస్తోంది. ఏకకాలంలో దాదాపు 15 ప్రాంతాల్లో దాడులు చేస్తోంది. కాగా తెల్లవారుజాము నుంచి నగరంలోని బంజారాహిల్స్, మాదాపూర్ తో పాటు పఠాన్ చెరులో సోదాలు కొనసాగుతున్నాయి. అదేవిధంగా ఫార్మా కంపెనీ ఎండీ శ్రీధర్ రావు నివాసంలోనూ అధికారులు తనిఖీలు చేస్తున్నారని సమాచారం. ఫినిక్స్ గ్రూప్స్ ఈడీ అధికారులు సోదాలు చేస్తున్నారు. రియ‌ల్ ఎస్టేట్ వ్యాపారంతో పాటు మైన్స్, ఆటో మొబైల్స్, ప‌లు ఫార్మా కంపెనీల‌తో పాటు వివిధ కంపెనీల గ్రూప్ ఆఫ్ కంపెనీల‌ను ఫినిక్స్ ఏర్పాటు చేసింది. ఈ కంపెనీల్లో ఈడీ అధికారులు సోదాలు చేస్తున్న‌ట్లు తెలుస్తోంది.


- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement