Thursday, April 25, 2024

Breaking: నేడే 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌

దేశంలో 5 రాష్ట్రాల ఎన్నికలకు సంబంధించి షెడ్యూల్ ను కేంద్ర ఎన్నికల సంఘం నేడు విడుదల చేయనుంది. మధ్యాహ్నం 3.30 గంటలకు షెడ్యూల్ విడుదల చేయనున్నారు. ఉత్తర్ ప్రదేశ్, పంజాబ్, గోవా, మణిపూర్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో అసెంబ్లీల కాలపరిమితి దగ్గరపడటంతో ఎన్నికలు నిర్వహించనున్నారు. ఫిబ్రవరి, మార్చి నెలలలో ఎన్నికలు జరుగనున్నట్లు తెలుస్తోంది.

మరోవైపు దేశంలో కరోనా కేసులు విజృంభిస్తున్న వేళ ఐదు రాష్ట్రాల ఎన్నికలు జరుగుతాయా?లేదా? అన్నప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలో కరోనా పరిస్థితులపై కేంద్ర ఆరోగ్య శాఖ అధికారులతో.. ఎన్నికల సంఘం అధికారులు ఇటీవల సమావేశం అయ్యారు. ఎన్నికలు జరగాల్సిన రాష్ట్రాల్లో కూడా ఎన్నికల సంఘం అధికారులు పర్యటించారు. ఎన్నికలు జరగడానికి అనువైన పరిస్థితులు ఉన్నాయని భావించిన తర్వాతే కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికల షెడ్యూల్ ఇచ్చేందుకు సిద్దం అయినట్లు తెలుస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement