Thursday, April 25, 2024

తగ్గేదేలే.. ఐదో రౌండ్ లోనూ ఈటల హవా

హుజురాబాద్‌ ఉప ఎన్నిక కౌంటింగ్‌లో బీజేపీ ముందంజలో ఉంది. బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ ఆధిక్యంలో ఉన్నారు. పోస్టల్‌ బ్యాలెట్ ఓట్లలో వెనుకంజలో ఉన్నా… అనంతరం ఈవీఏంలలోని ఓట్ల లెక్కింపు ప్రారంభం నుంచి బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ లీడ్‌లో కొనసాగుతున్నారు. తొలి రౌండ్‌లో 166, రెండవ రౌండ్‌లో 192, మూడవ రౌండ్‌లో 911 ఓట్ల ఆధిక్యతను సాధించారు. నాలుగో రౌండ్‌ ముగిసే సరికి 1,825 ఓట్ల లీడ్‌లో ఉండగా.. ఐదో రౌండ్‌లో కూడా ఈటల తన సత్తా చాటారు. ఐదో రౌండ్ లో 344 ఆధిక్యం వచ్చింది. మొత్తం  2,169 ఓట్ల ఆధిక్యత సాధించారు. ఇప్పటి వరకు బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ 17,969, టీఆర్ఎస్ అభ్యర్థి 16,144, కాంగ్రెస్ అభ్యర్థి వెంకట్ కు 680 ఓట్లు వచ్చాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement