Saturday, April 20, 2024

కాకినాడ మ‌త్స్య‌కారుల వ‌ల‌కి చిక్కిన అరుదైన చేప – రూ.4.30ల‌క్ష‌ల‌కి కొనుక్కున్న వ్యాపారులు

ఓ చేప ఏకంగా రూ.4.30ల‌క్ష‌ల‌కు అమ్ముడుపోయింది. అంత స్పెష‌ల్ ఏంటో ఆ చేప‌కి అనుకుంటున్నారా. ఈ చేప క‌డుపులో ఉండే బ్లాడ‌ర్ కు మంచి గిరాకీ ఉంటుంద‌ట‌. దాంతో ఈ చేప‌ను కొనేందుకు వ్యాపార‌స్తులు పోటీ ప‌డ్డారు. ఈ చేప క‌చ్చిడి మ‌గ‌చేప‌. తూర్పుగోదావ‌రి జిల్లా కాకినాడ మత్స్యకారుల వ‌ల‌కు ఈ అరుదైన చేప చిక్కింది.భారీ ధ‌రకు ఆ చేప అమ్ముడుపోయినందుకు హ‌ర్షం వ్య‌క్తం చేశారు. 30 కిలోలకు పైగా బరువు ఉండే కచ్చిడి మగ చేప చిక్క‌డంతో మ‌త్స్య‌కారులు ఎగిరి గంతులేశారు. కాకినాడ‌తో ఈ చేప‌ ఇంత ధర పలకడం ఇదే తొలిసారని అక్క‌డి మ‌త్స్య‌కారులు చెప్పారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement