Saturday, April 20, 2024

ఉత్తరకాశీలో భూకంపం.. తీవ్రత 3.1గా నమోదు

ఉత్తరాఖండ్‌ రాష్ట్రంలోని ఉత్తరకాశీలో భూకంపం వచ్చింది. ఈరోజు ఉదయం భూమి కంపించింది. భూకంపం తీవ్రత రిక్టర్ స్కేలుపై 3.1గా నమోదైందని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మాలజీ తెలిపింది. ఉత్తరకాశీకి 24 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్ర ఉన్నదని వెల్లడించింది. భూ అంతర్భాగంలో 5 కిలోమీటర్ల లోతులు కదలికలు సంభవించాయని చెప్పింది. కాగా, అర్ధరాత్రి వేళ భూమి కంపించడంతో ప్రజలు భయంతో ఇండ్లలో నుంచి బయటకు పరుగులు తీశారు. ఈమధ్య కాలంలో ప్రపంచ వ్యాప్తంగా భూప్రకంపనలు పెరిగిపోయాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement