Thursday, March 28, 2024

పాకిస్థాన్ లో భూకంపం.. తొమ్మిది మంది మృతి

ప‌లుచోట్ల భూకంపాలు అల్ల‌క‌ల్లోలం సృష్టిస్తున్నాయి. కాగా పాకిస్తాన్ లో భూకంపం సంభ‌వించింది. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 6.5 పాయింట్లుగా నమోదైంది. రాత్రిపూట భూమి కంపించడంతో పాక్ ప్రజలు భయాందోళనలకు గురయ్యారు. ఇండ్లలో నుంచి బయటకు పరుగులు తీశారు. దేశంలోని లాహోర్, ఇస్లామాబాద్, రావల్పిండి, క్వెట్టా, పెషావర్, కోహట్, లక్కీ మార్వాత్ సిటీలలో భూమి కంపించింది. పలుచోట్ల భవనాలు నేల కూలాయి.

ఒక్కసారిగా భూమి కంపించడంతో రావల్పిండిలోని మార్కెట్ లోని జనం భయంతో పరుగులు తీశారు. దీంతో తొక్కిసలాట జరిగింది. మరోవైపు, ఆఫ్ఘానిస్తాన్, భారత్, తుర్కెమెనిస్తాన్, కజకిస్తాన్, తజికిస్తాన్, ఉజ్బెకిస్తాన్, చైనా, కిర్గిజిస్తాన్ లలో కూడా భూకంప ప్రభావం కనిపించిందని ఇంటర్నేషనల్ సిస్మలాజికల్ సెంటర్ ఓ ప్రకటనలో తెలిపింది.దేశవ్యాప్తంగా భూకంపం కారణంగా తొమ్మిది మంది చనిపోయారని, మరో 160 మంది గాయపడ్డారని పాక్ అధికారులు తెలిపారు. పాక్, ఆఫ్ఘాన్ లలో సంభవించిన భూకంప ప్రభావం భారత్ లోనూ కనిపించింది. దేశ రాజధాని ఢిల్లీ సహా ఉత్తరాది రాష్ట్రాలలో భూమి స్వల్పంగా కంపించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement