Saturday, April 20, 2024

Breaking: మేఘాలయలో భూకంపం

గత కొన్ని రోజులుగా ప్రతిరోజూ ఎక్కడో ఒక చోట భూకంపాలు సంభవిస్తున్నాయి. ఈనెలలో టర్కీ, సిరియాలో భారీ భూకంపాలు సంభవించిన విషయం తెలిసిందే. అయితే తాజాగా మేఘాలయలో భూకంపం వచ్చింది. ఈ భూకంపం తీవ్రత రిక్టర్ స్కేల్ పై 3.7గా నమోదైంది. భూకంపం రావడంతో ఆ ప్రాంత ప్రజలు భయాందోళనలతో ఇళ్లలో నుంచి బయటకు పరుగులు తీశారు. అయితే ఈ భూకంపం కారణంగా ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని తెలుస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement