Friday, April 19, 2024

హిమాచల్ ప్రదేశ్ లో భూకంపం.. రిక్టర్ స్కేల్ పై 4.1గా నమోదు

హిమాచల్ ప్రదేశ్ లో భూకంపం వచ్చింది. రాష్ట్రంలోని మండీలో భూకంపం వచ్చిందని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ సెంటర్ తెలిపింది. రిక్టర్‌స్కేలుపై దీనితీవ్రత 4.1గా నమోదయిందని వెల్లడించింది. మండీకి 27 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉన్నదని చెప్పింది. భూ ప్రకంపణల వల్ల జరిగిన నష్టానికి సంబంధించిన సమాచారం ఇంకా తెలియరాలేదని అధికారులు తెలిపారు.హిమాలయ పర్వత ప్రాంతంలో గత 15 రోజుల్లో పదకొండు సార్లు భూకంపాలు సంభవించాయి. నవంబర్‌ 8 నుంచి ఇప్పటివరకు ఉత్తరాఖండ్‌-నేపాల్‌ సరిహద్దుల్లో ఈ భూ ప్రకంపణలు చోటుచేసుకున్నాయని అధికారులు వెల్లడించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement