Thursday, April 18, 2024

హింసించే భార్యపై కేసు నమోదు చేయవచ్చు: ఢిల్లీ హైకోర్టు

లాక్ డౌన్ కారణంగా దేశవ్యాప్తంగా గృహ హింస కేసులు పెరిగాయి. మానసిక, శారీరక, లైంగిక, ఆర్థికంగా ఇలా అనేక రకాలుగా మహిళలు వేధింపులకు గురవుతున్నారు. ఈ కొద్దికాలంలోనే గృహ హింస చట్టం కింద కేసులు భారీగా నమోదయ్యాయి. అయితే ఈ క్రమంలో ఢిల్లీ హైకోర్టు ముందుకు ఓ పిటిషన్ వచ్చింది. దానిపై విచారించిన న్యాయస్థానం ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.

ఈ మేరకు గృహహింస చట్టంపై సుప్రీంకోర్టు సంచలన ప్రకటన చేసింది. ఇకనుంచి మహిళలపై కూడా గృహ హింస కేసులు పెట్టవచ్చని స్పష్టం చేసింది. ‘భార్యలను భర్తలు వేధించడమే కాదు.. భార్యలూ భర్తలను వేధిస్తున్నారు’ అనే పిటిషన్‌పై విచారణ సందర్భంగా ఢిల్లీ హైకోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. ఇకనుంచి భర్తను హింసించే భార్యపై కూడా కేసు పెట్టవచ్చని సుప్రీం కోర్టు తీర్పు వెల్లడించింది. భర్తలు కూడా న్యాయం కోసం పోరాడవచ్చని తెలిపింది.

కాగా మహిళలపై రోజురోజుకూ జరుగుతున్న ఘోరాలను అరికట్టేందుకు 2006లో గృహ హింస నిరోధక చట్టాన్ని అమల్లోకి తెచ్చారు. అయినా మహిళలకు వేధింపులు తప్పడం లేదు. అయితే కొందరు మహిళలు ఈ చట్టాన్ని దుర్వినియోగం చేస్తున్నారని.. భార్యా బాధితులు అంటున్నారు. ఈ క్రమంలో వేసిన పిటిషన్ పై విచారించిన ఢిల్లీ హైకోర్టు.. భర్తను వేధించే భార్యపై కూడా కేసు పెట్టవచ్చని స్పష్టం చేసింది.

ఈ వార్తను కూడా చదవండి: బ్రిటీష్ కాలం నాటి చట్టం అవసరమా?

Advertisement

తాజా వార్తలు

Advertisement