Thursday, March 28, 2024

పెళ్లితో ఒక్కటవుతున్న డాక్టర్లు.. వాళ్లిద్దరూ ఆడాళ్లు కావడమే ఇష్యూ!

మహారాష్ట్ర రాష్ట్రంలోని నాగపూర్‌కు చెందిన ఇద్దరు మహిళా డాక్టర్లు పెళ్లి చేసుకుని ఒక్కటి కావాలనుకుంటున్నారు. ఇటీవలే ఈ ఇద్దరు ఆడ లేడీస్ ఉంగరాలు కూడా మార్చుకుని నిశ్చితార్థం చేసుకున్నారు. త్వరలోనే గోవాలో పెళ్లి చేసుకోవడానికి రెడీ అవుతున్నారు. కాగా, ఈ  ఇద్దరు మహిళా డాక్టర్ల పెళ్లి నాగపూర్‌లోనే కాదు.. యావత్ దేశమంతా హాట్ టాపిక్‌గా మారింది.

ఆ మహిళా డాక్టర్ల పేర్లు డా.పరోమితా ముఖర్జీ, డా.సుర్భి మిత్రా. పెళ్లిపై డా.పరోమితా మాట్లాడుతూ… ‘‘నా లైంగిక ధోరణి గురించి నా తండ్రికి 2013 నుంచి తెలుసు. నా తల్లికి ఈ విషయం తెలిసినప్పుడు ఆమె షాక్‌కి గురైంది. కానీ, ఆ తర్వాత నా ఇష్టాన్ని ఆమె అంగీకరించింది. నేను సంతోషంగా ఉండటమే మా అమ్మకు ముఖ్యం. అందుకే నా ఇష్టాన్ని కాదనలేదు.’’ అని పేర్కొన్నారు.

మరో డాక్టర్ సుర్భి మిత్రా మాట్లాడుతూ… ఒక మహిళగా మరో మహిళను పెళ్లి చేసుకునేందుకు తన కుటుంబం నుంచి ఎట్లాంటి వ్యతిరేకత ఎదురుకాలేదని తెలిపారు. నిజానికి వారు చాలా హ్యాపీగా ఫీలయ్యారని పేర్కొన్నారు. ఒక సైకో థెరపిస్ట్ గా తాను చాలామందితో మాట్లాడుతుంటానని… ఆ క్రమంలో చాలా సందర్భాల్లో వ్యక్తుల జీవితాల్లోని రెండు కోణాలను గమనించానని తెలిపారు. ‘‘మనసులో ఒకలా… బయటకు మరోలా జీవించడం సరికాదు.. అందుకే నా మనసుకు నచ్చిన నిర్ణయమే తీసుకున్నా’’ అని మిత్రా తెలిపారు. త్వరలోనే గోవాలో మ్యారేజ్ చేసుకునేందుకు ప్లాన్ చేసుకుంటున్నామని… తామిద్దరం జీవితాంతం జంటగా కలిసి బతకాలనుకుంటున్నామని చెప్పుకొచ్చారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement