Wednesday, April 24, 2024

Breaking | భద్రాచలం మూడు గ్రామాలుగా విభజన.. జీవో జారీ చేసిన తెలంగాణ ప్రభుత్వం

భ‌ద్రాద్రి కొత్త‌గూడెం జిల్లాలోని భద్రాచలాన్ని మూడు పంచాయతీలుగా విభజిస్తూ తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఇవ్వాల (శుక్రవారం) పంచాయతీ రాజ్​ యాక్ట్​ 2018 ప్రకారం జీవో నెంబర్​ 45ని అధికారులు రిలీజ్​ చేశారు. అంతేకాకుండా సారపాక గ్రామాన్ని కూడా రెండు పంచాయతీలుగా విభజించారు. భద్రాచలం రెవెన్యూ విలేజీలోని గ్రామాలైన భద్రచలం, సీతారాంనగర్​, శాంతినగర్​గా ఏర్పాటు చేశారు. ఇక.. సారపాక రెవెన్యూ విలేజీని సారపాక, ఐటీసీగా విభజించారు. అయితే భద్రాచలం గ్రామాన్ని విభజించొద్దని గతంలో ఆదివాసీ గిరిజనులు ఆందోళన చేసిన విషయం తెలిసిందే.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement