Monday, April 15, 2024

తెలంగాణ బీజేపీలో అసమ్మతి.. బండి తీరు న‌చ్చ‌ట్లేదంటున్న లీడ‌ర్లు..

తెలంగాణ బీజేపీలో అసమ్మతి రాగం మొదలైంది. అది కూడా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సొంత జిల్లా కరీంనగర్‌లోనే స్టార్ట్‌ అయ్యింది. ఏకంగా అసమ్మతి నేతలంతా రహస్యంగా భేటీ కావడం ఆ పార్టీలో కాకరేపుతోంది. దీంతో ఈ ఇష్యూను బీజేపీ జాతీయ నాయకత్వం సీరియస్‌గా తీసుకుంది. రహస్య భేటీపై నివేదిక ఇవ్వాలని జాతీయ నాయకత్వం తరుణ్‌ చుగ్‌ను ఆదేశించింది. నివేదిక తెప్పించుకునే పనిలో తరుణ్‌ చుగ్ నిమగ్నమయ్యారు. ఒకట్రెండు రోజుల్లో హైకమాండ్‌కు నివేదిక పంపనున్నారు.

తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ ఇలాకాలో సొంత పార్టీకి చెందిన కొంతమంది నేతలు రెండు రోజుల క్రితం రహస్యంగా సమావేశమయ్యారు. గత పార్లమెంట్ ఎన్నికల తర్వాత పార్టీ తమను పట్టించుకోవడం లేదని కరీంనగర్ జిల్లా స్థానిక నేతలు ఆరోపణలు చేస్తున్నారు. బండి సంజయ్ స్థానిక కార్యక్రమాలకు తమకు సమాచారం ఇవ్వడం లేదని, కొత్తగా పార్టీలో చేరిన వారికి ఇచ్చిన గుర్తింపు తమకు దక్కడం లేదని ఆత్మగౌరవ సమావేశం నిర్వహించారు. అందులో పలు అంశాలపై చ‌ర్చించిన‌ట్టు తెలుస్తోంది..

Advertisement

తాజా వార్తలు

Advertisement