Wednesday, March 27, 2024

దిశ ఎన్‌కౌంటర్‌ బాధిత కుటుంబాలను ఆదుకోవాలి : హైకోర్టు

రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేకెత్తించిన దిశ అత్యాచార, హత్య కేసు నిందితుల ఎన్‌కౌంటర్‌పై హైకోర్టులో ఈరోజు మరోసారి విచారణ జరిగింది. దిశ ఎన్‌కౌంటర్‌ బాధితుల తరపు వాదనలు పూర్తయ్యాయి. 10 మంది పోలీసులపై కేసులు నమోదు చేయాలని పేర్కొంది. అదేవిధంగా దిశ ఎన్‌కౌంటర్‌ బాధిత కుటుంబాలను ఆదుకోవాలని ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసులో ఈనెల 23న ప్రభుత్వం తన వాదనలు వినిపించనుంది. సిర్పూర్కర్ నివేదికను త్వరగా అమలు చేయాలని పోలీసు ఉన్నతాధికారులను హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణ ఈ నెల 23కు వాయిదా వేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement