Sunday, April 14, 2024

Breaking: ఓనం వేడుక‌ల్లో అప‌శ్రుతి.. బావిలో ప‌డిన కారు, ముగ్గురు మృతి

త‌మిళ‌నాడు రాష్ట్రం కోయంబ‌త్తూరులో దారుణం జ‌రిగింది. ఓనం వేడుక‌లు ముగించుకుని తిరిగి వ‌స్తుండ‌గా కారు ప్ర‌మాదం జ‌రిగింది. అతివేగంతో అదుపుత‌ప్పి కారు బావిలో ప‌డిపోయినట్టు తెలుస్తోంది. 70 అడుగుల లోతున్న బావిలో కారు బోల్తా కొట్టింది. ఈ ఘ‌ట‌న‌లో ముగ్గురు కాలేజీ విద్యార్థులు చ‌నిపోయారు. ఓనం వేడుక‌లు ముగించుకుని తిరిగి వ‌స్తుండ‌గా ఈ ప్ర‌మాదం జ‌రిగిన‌ట్టు స‌మాచారం. తొండాముత్తూర్‌లోని పొలాల ద‌గ్గ‌ర రోడ్డు ప‌క్క‌నే ఉన్న బావిలో కారు ప‌డిపోయింది. దీనికి సంబంధించిన మ‌రిన్ని వివ‌రాలు తెలియాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement