Thursday, April 25, 2024

Breaking: ధోనీకి గాయం… రేపటి మ్యాచ్ కు దూరం

అహ్మదాబాద్ : రేపటి నుంచి ఐపీఎల్ 2023 ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్ చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ గుజరాత్ జెయింట్స్ మధ్య తొలి మ్యాచ్ జరుగనుంది. ఈ నేపథ్యంలో చెన్నై సూపర్ కింగ్స్ కు గట్టి షాక్ తగిలింది. ఆ జట్టు స్కీప్పర్ మహేంద్ర సింగ్ ధోనీకి ప్రాక్టీస్ లో గాయమైంది. నెట్స్ లో ప్రాక్టీస్ చేస్తుండగా అతన్ని ఎడమ కాలుకు బలంగా బంతి తగిలింది. వెంటనే అతన్ని చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. ఈ నేపథ్యంలో ధోనీ రేపటి మ్యాచ్ లో ఆడే అవకాశాలు సన్నగిల్లాయి. ధోనీ గాయంపై ఆ జట్టు యాజమాన్యం ఇప్పటి వరకూ ఎటువంటి ప్రకటన చేయలేదు. అయితే గాయం కారణంగా ధోనీ తొలి మ్యాచ్ లో ఆడే అవకాశాలు లేవని వార్తలు వినవస్తున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement