Friday, April 19, 2024

డ‌ల్ అయిన ఢీ – ర‌ష్మీ, సుధీర్ లు లేని లోటు తెలుస్తోందంటోన్న ప్రేక్ష‌కులు

తెలుగు రాష్ట్రాల్లో ర‌ష్మీ,సుధీర్ ఈ పేర్లు తెలియ‌ని వారుండ‌రేమో. ఈ జంట‌కి ఎన‌లేని క్రేజ్ ఉంది. బుల్లితెర‌పై స్టార్ యాంక‌ర్స్ గా వీరికి ఎన‌లేని పేరు ఉంది. టాప్ రేటెడ్ డ్యాన్స్ రియాలిటీ షోగా ఢీ అల‌రిస్తోంది. ఈ షోలో ర‌ష్మీ, సుధీర్ ల మ‌ధ్య రొమాన్స్ హైలెట్ అనే చెప్పాలి. వీరిద్ద‌రూ చేసే డ్యాన్స్ లు, స్కిట్స్, ఆఖ‌రికి ఈ షోల‌లో పెళ్ళి కూడా చేసుకున్నారు ర‌ష్మీ, సుధీర్ లు. అవ‌న్నీ స‌క్సెస్ అయ్యాయి కూడా. దాంతో ఆ త‌ర్వాత సీజ‌న్ కి హైప‌ర్ ఆదిని రంగంలోకి దించారు.ఆది వచ్చాక కామెడీ పాళ్ళు కూడా కలిసి మొత్తంగా షో కంప్లీట్ ప్యాకేజ్ లా తయారైంది. జడ్జెస్ గా ప్రియమణి, పూర్ణ, యాంకర్స్ గా సుడిగాలి సుధీర్, హైపర్ ఆది, ప్రదీప్, రష్మీ గౌతమ్, దీపికా పిల్లి. సక్సెస్ ఫుల్ టీమ్ గా టాప్ టీఆర్పీ ఈ షోకి తెచ్చిపెట్టారు. అలా విజయపథంలో షో కొనసాగుతుండగా.. సమూల మార్పులు చేశారు.

ఢీ సీజన్ 14 నుండి రష్మీ, సుధీర్, దీపికా పిల్లి, పూర్ణలను తప్పించారు. మిగతా వారి సంగతి ఎలా ఉన్నా సుధీర్, రష్మీ లేని లోటు ప్రేక్షకులు బాగా ఫీల్ అవుతున్నారని టాక్ వినిపిస్తోంది. దాని ఫలితమే లేటెస్ట్ టీఆర్పీ రేటింగ్స్. ఢీ 14 ఎపిసోడ్స్ టీఆర్పీ దారుణంగా పడిపోయిందని సమాచారం . రష్మీ, సుదీర్ లేకుండా ఈ షోని ఊహించలేక‌పోతున్నార‌ట‌. పాత వాళ్లలో ప్రియమణితో పాటు హైపర్ ఆది, ప్రదీప్ మాత్రమే ఉన్నారు. కొత్తగా బిగ్ బాస్ ఫేమ్ అఖిల్, రవి కృష్ణతో పాటు మరికొందరిని రంగంలోకి దించారు. వీరి వలన షోకి దక్కిన ఫలితం ఏమీ లేదంటున్నారు. హైపర్ ఆది కామెడీతో ఒంటిచేత్తో షోని నడిపిద్దామనుకుంటే.. తేడా కొట్టిందన్న మాట వినిపిస్తుంది. షో మొదలై రెండు మూడు వారాలు మాత్రమే అవుతుండగా… పుంజుకునే అవకాశం లేకపోలేదు. అయితే రష్మీ, సుధీర్ లేని కారణంగా ఓ సెక్షన్ ఆడియన్స్ షోకి దూరం అయ్యారనే టాక్ వినిపిస్తోంది. సుధీర్, రష్మీని ఢీ 14 నుండి ఎందుకు తప్పించారనేది ఎవరికీ తెలియదు. సుడిగాలి సుధీర్ మాత్రం హీరోగా బిజీ అయ్యాడు. రెమ్యూన‌రేష‌నే వీరు ఢీని వ‌దిలివేయ‌డానికి కార‌ణ‌మేమో అనే వాద‌న వినిపిస్తోంది. నిజా నిజాలు వారికే తెలియాలి.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement