Thursday, April 25, 2024

వైర‌ల్ గా మోడీ..యోగి ఆదిత్య‌నాథ్ ఫొటోస్..

ఉత్త‌ర‌ప్ర‌దేశ్ సీఎం యోగి ఆదిత్య‌నాథ్ ప్ర‌ధాని మోడీతో క‌లిసి దిగిన ఫొటోల‌ని ట్విట్ట‌ర్ లో షేర్ చేశారు. 56వ డీజీపీ – ఐజీపీ కాన్ఫ‌రెన్స్ లో పాల్గొనేందుకు మోడీ ల‌క్నో వెళ్ళారు. ఈ సంద‌ర్భంగా దిగిన ఫొటోలు ఇవి. కాగా ప్ర‌ధానితో దిగిన ఫొటోల‌ని యోగి షేర్ చేసిన కొద్దిసేపటికే వైరల్ అయ్యాయి. యోగి ఆదిత్యనాథ్ ,ప్రధాని నరేంద్ర మోడీ కలిసి నడుచుకుంటూ ఏదో అంశాంపై దీర్ఘంగా చర్చిస్తున్న ఫోటో కావడంతో సంచలనంగా మారింది. ఇవి అరుదైన ఫోటోలుగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. రెండు ఫొటోలను పోస్ట్ చేసిన యోగి ఆదిత్యనాథ్.. నవభారత్ నిర్మాణానికి కట్టుబడి ఉన్నానని ట్యాగ్ చేశారు. ఒక చిన్న కవిత కూడా రాశాడు. “మన ప్రతిజ్ఞతో ముందుకు సాగుతున్నాం. (తన్, మన్) తనువు, మనసు దేశం కోసం అంకితం చేయాలని.. నవభారతాన్ని నిర్మించాలని ప్రతిజ్ఞ తీసుకున్నాం” అని అందంగా రాశారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌, ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement