Friday, April 26, 2024

తిరుమ‌ల శ్రీవారికి రూ.30ల‌క్ష‌ల విలువైన చెవి దిద్దులు-కానుక‌ ఇచ్చిన బెంగుళూరు భ‌క్తులు

ఆరు వంద‌ల గ్రాముల బంగారంతో ప్ర‌త్యేకంగా చెవిదిద్దులు త‌యారు చేయించి ..తిరుమల శ్రీవారికి కానుక ఇచ్చారు బెంగుళూరు కే.ఆర్ పురంకు చెందిన మునిరాజ కుటుంబ సభ్యులు ఈ చెవి దిద్దుల విలువ రూ. 30లక్షలు కాగా.. స్వామివారిని వీఐపీ బ్రేక్ దర్శన సమయంలో దర్శించుకుని.. ఈ కానుకను టీటీడీ ఈవో ధర్మారెడ్డి చేతుల మీదుగా అందజేశారు. మరోవైపు తిరుమల శ్రీవారికి నెల్లూరుకు చెందిన‌ హ‌ర్ష ట‌యోటా ఎండి హ‌ర్ష‌వ‌ర్థ‌న్ దాదాపు రూ.19 లక్షల విలువైన కారును అందజేశారు. టయోటా రైడ‌ర్ హైబ్రీడ్ పెట్రోల్ మ‌రియు బ్యాట‌రీతో న‌డిచే కారు విరాళంగా అందించారు. ఈ మేరకు శ్రీవారి ఆలయం ఎదుట వాహనానికి ప్రత్యేక పూజలు నిర్వహించి తాళాలను టీటీడీ ఈవో ధ‌ర్మారెడ్డికి అందజేశారు. భక్తులు తిరుమల శ్రీవారికి కానుకలు చెల్లించి మొక్కులు చెల్లించుకుంటారు.. బంగారంతో పాటూ వాహనాలను కూడా విరాళంగా అందజేస్తుంటారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement