Saturday, April 20, 2024

స్వామి వారికి రూ. 3.5కోట్ల విలువైన న‌గ‌ల‌ను అంద‌జేసిన అజ్ఞాత భక్తుడు ..

శ్రీవారికి ఓ అజ్ఞాత భ‌క్తుడు భారీగా బంగారు న‌గ‌ల‌ను విరాళంగా ఇచ్చాడు. ఆ వ్య‌క్తి వివ‌రాలు తెలియ‌రాలేదు. కానీ ఆయ‌న చెన్నైకు చెందిన ఓ వ్యాపారి అని స‌మాచారం. వీఐపీ ద‌ర్శ‌న‌ ప్రారంభ స‌మ‌యంలో ఆ బంగారు న‌గ‌ల‌ను శ్రీ‌వారికి స‌మ‌ర్పించాడు భ‌క్తుడు . కాగా ఆ న‌గ‌లు ఆరు కిలోలు ఉన్నాయ‌ట‌. బంగారు కఠి, వరద హస్తాలను టీటీడీ అర్చ‌కుల‌కు భ‌క్తుడు అంద‌జేశాడు. వాటిని ఈ రోజు అభిషేక సేవ అనంతరం స్వామి వారికి అర్చకులు అలంకరించారు. తిరుమ‌ల శ్రీవారికి బంగారు క‌ఠి, వ‌ర‌ద‌హ‌స్తాల‌ను విరాళంగా ఇచ్చాడు. కాగా ఆ బంగారు న‌గ‌ల విలువ రూ. 3.5కోట్లు ఉంటాయ‌ని తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement