Saturday, April 20, 2024

జైల్లో నా భర్తకు ప్రాణహాని: గవర్నర్​, హైకోర్టు సీజేలకు దేవినేని భార్య లేఖ

రాజమండ్రి సెంట్రల్‌ జైలులో తన భర్తకు ప్రాణహాని ఉందంటూ మాజీ మంత్రి దేవినేని ఉమ భార్య అనుపమ గవర్నర్‌, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి, కేంద్ర, రాష్ట్ర హోంమంత్రులకు లేఖ రాశారు. అవినీతి మైనింగ్‌పై పోరాడుతున్న ఉమకు.. గూండాలతో  ప్రాణహాని ఉందన్నారు. గతంలో జైళ్లలో జరిగిన హత్యా ఉదంతాల నేపథ్యంలో తన భర్తకు ఏదైనా హాని తలపెట్టే అవకాశం ఉందని ఆమె లేఖలో పేర్కొన్నారు. రాజమహేంద్రవరం జైలు సూపరింటెండెంట్‌ను ఆకస్మాత్తుగా బదిలీ చేయడం అనుమానం కలిగిస్తోందన్నారు.  తన భర్తకు తగిన భద్రత, రక్షణ కల్పించాల్సిందిగా అనుమప లేఖలో కోరారు.  పదవిలో ఉన్నా లేకపోయినా, తన భర్త దేవినేని ఉమ ప్రజా జీవితంలో ఎంతో చురుగ్గా ఉన్నారని తెలిపారు. ఆయన అవినీతికి తీవ్ర వ్యతిరేకి అని, అక్రమ మైనింగ్ పై మొదటి నుంచి పోరాడుతున్నారని వివరించారు. అందుకే మైనింగ్ మాఫియా తన భర్తను లక్ష్యంగా చేసుకున్నట్టు అనుపమ లేఖలో ఆరోపించారు. తన భర్త ప్రాణాలకే కాకుండా, తమ ఆస్తులకు, ఇతర కుటుంబ సభ్యులకు తీవ్ర ముప్పు కలుగజేసేందుకు ప్రయత్నిస్తున్నారని లేఖలో పేర్కొన్నారు. కాగా, ఎస్సీ, ఎస్టీ కేసుతో పాటు హత్యాయత్నం కేసు ఎదుర్కొంటున్న టీడీపీ నేత దేవినేని ఉమ ప్రస్తుతం రాజమండ్రి కేంద్ర కారాగారంలో రిమాండ్ లో ఉన్నారు.

ఇది కడా చదవండిః రాష్ట్రంలో గూండాల రాజ్యముందా?: చంద్రబాబు

Advertisement

తాజా వార్తలు

Advertisement