Thursday, April 25, 2024

ప‌లు అభివృద్ధి కార్య‌క్ర‌మాల‌కు శంకుస్థాప‌న – పాల్గొన్న మంత్రి ఎర్ర‌బెల్లి

గ్రామీణ రహదారుల నిర్మాణం .. ప్రజల ప్రయాణ సౌకర్యార్థం కోసం .. తెరాస ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని మంత్రులు వెల్లడించారు. రాష్ట్ర పంచాయితీ రాజ్ .. గ్రామీణాభివృద్ధి మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ,రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రా రెడ్డి ,మాజీ మంత్రి ,ప్రస్తుత‌ M L C పట్నం మహేందర్ రెడ్డి ,చేవెళ్ల పార్లమెంట్ సభ్యులు G .రంజిత్ రెడ్డి ,చేవేళ్ల MLA కాలే యాదయ్య మండలంలోని పలు అభివృద్ధి కార్యక్రమాలలో పాల్గొన్నారు. 2 కోట్ల 20 లక్షల రూపాయలతో మంజూరైన ఎన్కెపల్లి నుంచి బాకారం రహదారి పనులకు ఎన్కెపల్లి నందు శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించారు. 2 కోట్ల 50 లక్షల రూపాయల నిధులతో మంజూరైన చిలుకూరు -మొయినాబాద్ -సురంగల్ రహదారి పనులకు చిలుకూరు నందు శంకుస్థాపన కార్యక్రమం.,జడ్పీటీసీ,మాజీ జడ్పీటీసీ,మండల నాయకులు ,ఎంపీపీ,మాజీ ఎంపీపీ లు ,రైతు సమన్వయ సభ్యులు, మహిళ నాయకులు,యువ నాయకులు,సర్పంచులు, మాజీ సర్పంచులు, ఎంపీటీసీలు, మాజీ ఎంపీటీసీలు,. అధికారులు కార్యకర్తలు ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement