Thursday, March 28, 2024

ద‌క్షిణ ఢిల్లీలో అక్ర‌మ క‌ట్ట‌డాల కూల్చివేత‌

అక్ర‌మ నిర్మాణాల కూల్చివేత‌ని చేప‌ట్టారు ఢిల్లీ మున్సిపాలిటీ అధికారులు. ఈ మేర‌కు ద‌క్షిణ ఢిల్లీ మున్సిపాల్టీ ప‌రిధిలోని న్యూ ఫ్రెండ్స్ కాల‌నీలో నేడు భారీ భ‌ద్ర‌త ఏర్పాటు చేశారు. ద‌క్షిణ ఢిల్లీలోని అనేక ప్రాంతాల్లో కూల్చివేత డ్రైవ్ కొన‌సాగిస్తున్నారు. మే 4వ తేదీ నుంచి 13వ తేదీ వ‌ర‌కు అక్ర‌మ నిర్మాణాల‌ను తొల‌గించ‌నున్నారు. నార్త్ ఢిల్లీ మున్సిపాల్టీ ప‌రిధిలోని మంగోల్‌పురిలో కూడా అక్ర‌మ నిర్మాణాల కూల్చివేత కొన‌సాగుతోంది. అక్క‌డ కూడా బుల్డోజ‌ర్ల‌తో ప‌ని చేప‌ట్టారు. ష‌హీన్‌భాగ్‌లోనూ బుల్డోజ‌ర్ల క‌ల‌క‌లం సృష్టించిన విష‌యం తెలిసిందే. కొన్ని రోజుల క్రితం జ‌హంగిర్‌పురిలో కూడా అక్ర‌మ నిర్మాణాల‌ను కూల్చివేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement