Friday, April 19, 2024

ఢిల్లీ లిక్క‌ర్ స్కామ్‌.. రిమాండ్ రిపోర్టులో ప‌లు కీలాకాంశాలు వెల్ల‌డించిన ఈడీ

ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో నిందితులు విజయ్ నాయర్, అభిషేక్ బోయిన్ పల్లి కస్టడీని కోర్టు పొడిగించింది. ఈడీ పిటిషన్ ను పరిగణనలోకి తీసుకున్న సీబీఐ ప్రత్యేక కోర్టు వారిద్దరి కస్టడీని మరో ఐదు రోజులపాటు పొడిగిస్తున్నట్టు ఇవ్వాల (శనివారం) తెలిపింది. ఈడీ తొమ్మిది రోజుల కస్టడీ కోరగా, న్యాయస్థానం ఐదు రోజులే మంజూరు చేసింది. ఇక‌.. విజయ్ నాయర్ కు సంబంధించిన రిమాండ్ రిపోర్టులో ఈడీ ప‌లు కీలక అంశాలు ప్రస్తావించింది.

ప్రభుత్వంలోని పెద్దలకు రూ.100 కోట్ల వరకు ముందస్తు చెల్లింపులు జరిగినట్టు రిమాండ్ రిపోర్టులో ఈడీ పేర్కొంది. అభిషేక్ బోయిన్ పల్లి, విజయ్ నాయర్ కలిసి లంచాలు ఇచ్చారని తెలిపింది. హోల్ సేల్ అమ్మకందారుల నుంచి డబ్బు వసూలు చేసి ప్రభుత్వ పెద్దలకు ఇచ్చారని వివరించింది. ఈ 100 కోట్ల ముడుపుల్లో రూ.30 కోట్లను అభిషేక్ బోయిన్ పల్లి హైదరాబాద్ నుంచి హవాలా మార్గంలో దేశ రాజధానికి తరలించాడని పేర్కొంది.

కాగా, విజయ్ నాయర్ తనను తాను ఢిల్లీ ఎక్సైజ్ ఉన్నతాధికారిగా పరిచయం చేసుకున్నాడని ఈడీ త‌న రిమాండ్ రిపోర్టులో వెల్లడించింది. మద్యం పాలసీని తమవారికి వాట్సాప్ గ్రూపుల్లో షేర్ చేశాడని తెలిపింది. మద్యం పాలసీ, తయారీకి రెండు నెలల ముందే విజయ్ నాయర్ చేతుల్లోకి వచ్చేసిందని, దాన్ని వాట్సాప్ గ్రూపుల్లో షేర్ చేసిన‌ట్టు ఈడీ పేర్కొంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement