Thursday, April 25, 2024

సి.ఐ వేధింపులు..లైవ్ లో పురుగుల మందు తాగిన యువ‌కుడు..

త‌న‌పై అక్ర‌మ‌కేసులు న‌మోదు చేసి సిఐ వేధిస్తున్నాడ‌ని ఓ యువ‌కుడు పురుగుల మందు తాగి ఆత్మ‌హ‌త్య‌కి పాల్ప‌డ్డాడు. ఈ సంఘ‌ట‌న సిరిసిల్ల జిల్లా తంగాల్ల‌ప‌ల్లి మండ‌లం బ‌స్వాపూర్ లో చోటు చేసుకుంది. గొలిసెల దిలీప్ అనే యువ‌కుడు ట్రాక్టర్ డ్రైవర్ గా పని చేస్తున్నాడు. కాగా తనను సిరిసిల్ల టౌన్ సిఐ అరుణ్ కుమార్ తప్పుడు కేసు పెట్టి జైలుకు కూడా పంపించాడు అని ఆరోపించాడు. ఆదివారం తనపై మరోకేసు నమోదు చేసి స్టేషన్ కు రమ్మన్నాడు అని చెబుతూ లైవ్ లో పురుగుల మందు తాగాడు.

దాంతో వెంటనే అతడి లైవ్ లొకేషన్ ను ట్రేస్ చేసి 108 అంబులెన్స్ లో ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం యువకుడి పరిస్థితి విషమంగా ఉంది. ఇదిలా ఉంటే దిలీప్ ఓ యువతిని వేధించాడని, ఆమె ఫోటోలు తీసి వేధింపులకు గురి చేశాడని సీఐ తెలిపాడు. యువతి ఫిర్యాదు తోనే అతడిపై కేసు నమోదు చేసి జైలుకు పంపించామన్నాడు. అయినా వేధింపులకు గురి చేయడంతో షీటీమ్ సూచనతో మరో కేసు నమోదు చేశామని చెప్పారు. మ‌రి ఇందులో నిజ నిజాలు తేలాల్సి ఉంది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ఆంధ్రప్రభ న్యూస్ కోసం  ఫేస్‌బుక్‌ట్విట్టర్  పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement