Thursday, March 28, 2024

Danger Bells – గెలవాలంటే మోడీ ఛరిష్మా సరిపోదన్న ఆర్ ఎస్ ఎస్

నాగ‌పూర్ .. రాబోయే ఎన్నిక‌ల‌లో బిజెపి గెల‌వ‌డం అంత సుల‌భం కాద‌ని భారతీయ జనతా పార్టీ(బీజేపీ) సైద్ధాంతిక సంస్థ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్(ఆర్ఎస్ఎస్) అభిప్రాయం వ్య‌క్తం చేసింది.. ఈ మేర‌కు దాని అనుబంధ పత్రిక ‘ది ఆర్గనైజర్’ బీజేపీ గెలుపుపై సంపాదకీయాన్ని ప్ర‌చురించింది.. గత నెలలో జరిగిన కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఓడిన ఈ నేపథ్యంలో రాసిన ఈ ఎడిటోరియ‌ల్ లో ఎన్నికల్లో గెలవడానికి మోడీ చరిష్మా, హిందుత్వ సరిపోదని స్పష్టం చేసింది.

ప్రాంతీయ స్థాయిలో బలమైన నాయకత్వం, సమర్థవంతమైన పనితీరు లేకుండా, ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ చరిష్మా, హిందుత్వ ఎన్నికల్లో గెలవడానికి సరిపోదని వ్యాఖ్యానించింది. బీజేపీ పరిస్థితిని సమీక్షించడానికి ఇది సరైన సమయం అని చెప్పింది. రాష్ట్రస్థాయిలో పాలన ఉన్నప్పుడు సానుకూల అంశాలు, భావజాలం, నాయకత్వం బీజేపీకి నిజమైన ఆస్తులు అని పేర్కొంది.


క‌ర్నాట‌క‌లో బొమ్మై ప్రభుత్వంపై వచ్చిన అవినీతి ఆరోపణలను సూచిస్తూ, ఎన్నికల ఫలితాలు ఆశ్చర్యకరంగా ఉన్నా, దిగ్భ్రాంతిని కలిగించేవి కాదని పేర్కొంది. ప్రధాని మోడీ కేంద్రంలో అధికార పగ్గాలు చేపట్టిన తర్వాత కర్ణాటక ఎన్నికల్లో మాత్రమే బీజేపీ అవినీతి ఆరోపణలను ఎదుర్కొన్న‌ద‌ని, వాటిని సమర్థించుకోవాల్సి రావ‌డంతో అక్క‌డ అధికారాన్ని కోల్పోయింద‌ని వెల్ల‌డించింది.. 2024 లోక్ సభ ఎన్నికలకు ముందు ఈ ఫలితాలు కాంగ్రెస్ పార్టీకి మ‌రింత‌ బలం చేకూరుస్తాయని పేర్కొంది.

జాతీయ స్థాయి నాయకత్వ పాత్ర తక్కువగా ఉన్నప్పుడు, స్థానిక స్థాయిలో ఎన్నికల ప్రచారం ఉన్నప్పుడు కాంగ్రెస్ ఎన్నికల్లో బాగా పనిచేస్తుందని విశ్లేషించింది. కర్ణాటక ఎన్నికల్లో బీజేపీ తన శక్తిని అంతా నిలిపి పోరాడింద‌ని,. అయితే స్థానిక‌ కాంగ్రెస్ నేత‌లు బ‌ల‌మైన ప్ర‌చారంతో తిరుగులేని మెజారిటీతో కాంగ్రెస్ విజయం సాధించిందిన పోస్ట్ మార్ట‌మ్ చేసింది.. దిద్దుబాటు చ‌ర్య‌లు చేప‌ట్ట‌క‌పోతే భ‌విష్య‌త్ లోనూ బిజెపికి క‌ర్నాట‌క ఫ‌లితాలే వ‌స్తాయ‌ని హెచ్చ‌రించింది..

Advertisement

తాజా వార్తలు

Advertisement