Saturday, April 20, 2024

తెలుగు నిర్మాతల మండలి అధ్యక్షుడిగా దామోదరప్రసాద్

తెలుగు నిర్మాతల మండలి అధ్యక్షుడిగా దామోదరప్రసాద్ గెలుపొందారు. జెమిని కిరణ్ పై 24 ఓట్ల తేడాతో దామోదర ప్రసాద్ విజయం సాధించారు. నిర్మాత మండలిలో మొత్తం సభ్యులు 1,134 మంది ఉండగా.. 678 ఓట్లు పోలయ్యాయి. ఉపాధ్యక్ష పదవికి సుప్రియ అశోక్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. జనరల్ సెక్రటరీగా ప్రసన్నకుమార్, వైవీఎస్ చౌదరి గెలవగా… జాయింట్ సెక్రటరీగా భరత్ చౌదరి, నట్టికుమార్ గెలుపొందారు. ఈసీ మెంబర్లుగా దిల్‌రాజు, దానయ్య, రామకృష్ణగౌడ్ విజయం సాధించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement