Thursday, April 25, 2024

కేవైసీ అప్డేట్ పేరుతో 9 లక్షల మోసం..

హైదరాబాద్ టోలిచౌకి లో సైబర్ నేరగాళ్లు రెచ్చిపోయారు. టోలిచౌకి కి చెందిన ఓ మహిళ దగ్గర 9 లక్షలు మాయం చేశారు. సదరు మహిళకు ఫోన్ చేసి బ్యాంకు అధికారిని మాట్లాడుతున్నానని మాయ చేశారు. మీడెబిట్ కార్డు కేవైసీ అప్డేట్ చేసుకోకపోతే కార్డు బ్లాక్ చేస్తామని చెప్పి నమ్మించారు. దీంతో కార్డు డీటెయిల్స్ చెప్పింది మహిళ..అనంతరం వెంటనే అకౌంట్ నుంచి 9 లక్షలు మాయమయ్యాయి. దీంతో విషయం గ్రహించిన మహిళ మోసం చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని హైదరాబాద్ సిసిఎస్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన సైబర్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఇక మరో ఘటనలో కంపెనీల పేరు చెప్పి లోన్ ఇస్తామని 2 లక్షలు కాజేశారు సైబర్ కేటుగాళ్లు. ముందుగా డాక్యుమెంట్ చార్జి వివిధ చార్జీల పేరుతో 2 లక్షల 50 రూపాయలు ఆన్లైన్ ద్వారా ట్రాన్స్ఫర్ చేయించుకున్నారు కేటుగాళ్లు. అయితే లోన్ రాకపోవడంతో మోసపోయాం అని గమనించిన బాధితులు…హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు.

Advertisement

తాజా వార్తలు

Advertisement