– డిజిటల్ మీడియా, ఆంధ్రప్రభ
ఢిల్లీకి చెందిన జ్యుయెల్లర్స్ వ్యాపారికి, అతని భార్యకు చాలా కాలంగా గొడవలు జరుగుతున్నాయి. కాపురం సరిగా సాగడంలేదు. అయితే.. ఆమె వేరే వ్యక్తితో రంకు సాగించడమే దీనికి కారణంగా తెలుస్తోంది. కొన్ని రోజుల తర్వాత భార్య బాగోతం తెలిసిన భర్త విస్తుపోతాడు. అయితే.. అతనికి దమ్కీ ఇచ్చేలా ఆ వ్యాపారి భార్య మరో డేంజరస్ ఉపాయం పన్నింది.ఈ కిలాడీ కోడలు ఏకంగా అత్తమామల బెడ్రూమ్లో రహస్య కెమెరాలను అమర్చింది. వారి ప్రైవేట్ ఫొటోలు, అభ్యంతరకరమైన వీడియోలను రికార్డు చేసింది.
చివరకు రూ.2 కోట్ల విలువైన నగలు, రూ.1.5 లక్షల నగదుతో ఇంటి నుంచి పరారైంది. భర్త ఫిర్యాదు మేరకు ఢిల్లీలోని లక్ష్మీనగర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆ వ్యాపారి భార్యతో గొడవల కారణంగా వారిద్దరూ ఒకే ఇంట్లో వేర్వేరు గదుల్లో నివాసముంటున్నారు. అయితే.. భార్య తన కాలేజీ ఫ్రెండ్తో అక్రమ సంబంధం కొనసాగిస్తోందన్న విషయం భర్తకు తెలిసినప్పటి నుంచి మరింతగా గొడవులు జరుగుతున్నాయి.
ఈ క్రమంలో సెప్టెంబరు 5న భార్య మొబైల్లో స్నేహితుడి నుంచి వచ్చిన అసభ్యకరమైన సందేశాన్ని భర్త చూశాడు. ఆ తర్వాత మొబైల్లో వచ్చిన ఇతర మెసేజ్లను చదవడంతో అతనికి ఆమె లవ్ ఎఫైర్ గురించి తెలిసింది. దీంతో తన భార్య లవర్కి ఫోన్ చేసి తనను కలవాలంటూ కోరాడు. ఈ విషయం తెలుసుకున్న భార్య.. ఇంట్లో ఉన్న నగలు, నగదుతో ఉడాయించింది.
దీంతో భర్త పోలీసులను ఆశ్రయించాడు. ఆ తర్వాత భర్తకు ఫోన్ చేసిన ఆ కిలాడీ లేడీ.. బెదిరింపులకు దిగింది. తమ ఇంట్లో అత్తమామల (భర్త తల్లిదండ్రులు) గదిలో రహస్య కెమెరాలు పెట్టి వారి నగ్న వీడియోలు తీశానని.. కేసును వాపస్ తీస్కోక పోతే ఈ వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తానని బెదిరించింది. అనంతరం పోలీసులు తనిఖీలు చేయగా.. వారి గదిలో కెమెరాలు, రికార్డర్లు అమర్చినట్లు గుర్తించారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి నిందితుల కోసం గాలిస్తున్నారు.