Wednesday, April 24, 2024

క్రికెటర్ రవీంద్ర జడేజా భార్య.. రివాబా ఘనవిజయం

గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల ఫ‌లితాలు వెలువ‌డుతున్నాయి. గుజ‌రాత్ రాష్ట్రంలో బీజేపీ చారిత్రాత్మక విజయాన్ని అందుకునే దిశగా దూసుకెళ్తోంది. దాదాపు 157 సీట్లలో పూర్తి ఆదిక్యంతో కొన‌సాగుతోంది. మొత్తం 182 స్థానాలున్న గుజరాత్ అసెంబ్లీలో బీజేపీ 97 స్థానాల్లో విజయకేతనం ఎగురవేసి, మరో 58 చోట్ల ముందంజలో కొనసాగుతుంది. ఇక ఈ ఎన్నికల్లో జూమ్ నగర్ నార్త్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన క్రికెటర్ రవీంద్ర జడేజా భార్య.. రివాబా జడేజా ఘనవిజయం సాధించింది. ఆమె తన ప్రత్యర్థి పై 61 వేలకు పైగా భారీ మెజారిటీ సాధించినట్లు జాతీయ మీడియా పేర్కొంది. క్షత్రియ ప్రభాల్యం ఉన్న ఈ సెగ్మెంట్లో రవీంద్ర జడేజా భార్య భారీ మెజారిటీతో గెలుపొందింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement