Wednesday, April 24, 2024

Liquor | ప్రతి బాటిల్‌పై ఒక్క రూపాయి ఆవు పన్ను.. ఉత్తరాఖండ్​లో మద్యంపై 4వేల కోట్ల ఆమ్​దానీ టార్గెట్!​

ఉత్తరాఖండ్​ ప్రభుత్వం నూతన ఎక్సైజ్​ పాలసీని ప్రకటించింది. 2023-24 సంవత్సరానికి సంబంధించిన ఈ పాలసీకి అక్కడి ప్రభుత్వం ఆమోదముద్ర వేసింది. ఇవ్వాల కేబినెట్ భేటీ తర్వాత సీఎం పుష్కర్‌సింగ్‌ ధామి, ఎక్సైజ్‌ సెక్రెటరీ హరిచంద్ర సెమ్‌వాల్‌ ఈ విషయాన్ని మీడియాకు వెల్లడించారు. పొరుగున ఉన్న ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రం నుంచి ఉత్తరాఖండ్‌లోకి మద్యం పెద్ద ఎత్తున అక్రమ రవాణా జరుగుతోందని, దీన్ని అరికట్టడమే తమ లక్ష్యంగా వారు తెలిపారు. అందుకని ఈ కొత్త మద్యం పాలసీని తీసుకొస్తున్నట్టు వెల్లడించారు.

ఉత్తరప్రదేశ్‌తో పోల్చితే ఉత్తరాఖండ్‌లో మద్యం ధరలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఒక్కో బాటిల్‌పైన రూ.150 నుంచి రూ.200 దాకా వేరియేషన్​ ఉంది. దీంతో తక్కువ ధరకు లభించి యూపీ సరుకు అంతా ఉత్తరాఖండ్‌లోకి అక్రమ రవాణా అవుతోంది. ఇట్లాంటి లిక్కర్‌ స్మగ్లింగ్‌ను అరికట్టేందుకు ప్రభుత్వం నూతన మద్యం పాలసీలో కీలక మార్పు చేసింది. యూపీతో పోల్చితే మద్యం ధరల వ్యత్యాసాన్ని ఒక్కో బాటిల్‌పై ఇప్పుడు రూ.20కి తగ్గించింది.

అట్లనే ఉత్తరాఖండ్‌ నూతన మద్యం పాలసీతో ప్రభుత్వం రెవెన్యూను పెంచుకునే మరో ఆలోచన కూడా చేసింది. ప్రతి బాటిల్‌పై ఒక్క రూపాయి చొప్పున ఆవు పన్ను, క్రీడా పన్ను, మహిళ సంక్షేమ పన్నును విధిస్తూ తీర్మానించింది. అంటే మద్యం ప్రియులు ఈ మూడు పన్నులకు కలిపి ఒక్కో బాటిల్‌ ధరపై అదనంగా రూ.3 చొప్పున చెల్లించాల్సి ఉంటుంది. కాగా, ఈ ఏడాది ఎక్సైజ్‌ రెవెన్యూ లక్ష్యాన్ని ఉత్తరాఖండ్‌ సర్కారు రూ.4 వేల కోట్లుగా నిర్దేశించుకుంది.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement