Tuesday, April 23, 2024

కరోనా బారిన పడిన వారు ఏం తినాలి? కేంద్ర ప్రభుత్వం పలు సూచనలు జారీ

క‌రోనా బారిన పడిన పేషెంట్లు తీసుకోవాల్సిన ఆహారంపై భారత ప్రభుత్వం ప‌లు సూచ‌న‌లు చేసింది. ఈ మేర‌కు MyGovIndia ఓ ట్వీట్ చేసింది. దేశ‌వ్యాప్తంగా క‌రోనా సెకండ్‌వేవ్ విజృంభిస్తున్న వేళ ఆస్పత్రుల అవ‌స‌రం రాకుండా ఇంట్లోనే ఉండి కోలుకునే వారి సంఖ్యను పెంచ‌డానికి మెరుగైన ఆహార‌మే మార్గ‌మ‌ని ప్ర‌భుత్వం చెబుతోంది. స‌రైన ఆహారం తీసుకుంటే 80 నుంచి 85 శాతం పేషెంట్లు ఇంట్లోనే కోలుకుంటున్న‌ట్లు స్పష్టం చేసింది.

✪ త‌గిన స్థాయిలో విట‌మిన్లు, ఖ‌నిజాలు శ‌రీరానికి అంద‌డానికి ఐదు ర‌కాలు పండ్లు, కూర‌గాయ‌లు ఆహారంలో ఉండేలా చూసుకోవాలి
✪ క‌రోనా తాలూకు ఆందోళ‌న‌ను అదుపులో ఉంచుకోవ‌డానికి 70 శాతం కొకొవా ఉన్న డార్క్ చాక్లెట్లు కొద్ది మొత్తంలో తీసుకోవాలి
✪ రోగ‌నిరోధ‌క శ‌క్తి పెంచుకోవ‌డానికి ప్ర‌తి రోజూ ఒక‌సారి ప‌సుపు పాలు తాగాలి
✪ రోజూ త‌క్కువ మొత్తంలో ఎక్కువ‌సార్లు తినాలి. ఆహారంలో ఆమ్‌చూర్ (మామిడి పొడి) ఉండేలా చూసుకోవాలి
✪ రాగి, ఓట్స్‌ లాంటి తృణ‌ధాన్యాలు తినాలి
✪ ప్రొటీన్ ఎక్కువ‌గా అందించే చికెన్‌, ఫిష్‌, గుడ్లు, ప‌నీర్‌, సోయా, కాయ‌గింజ‌లు తీసుకోవాలి
✪ బాదం, వాల్‌న‌ట్స్‌, ఆలివ్ ఆయిల్‌ వంటివి ఆహారాల్లో చేర్చుకోవాలి

https://twitter.com/mygovindia/status/1390347626994864134

ఈ స్టోరీ కూడా చదవండి: కరోనా నుంచి కోలుకున్నారా? అయితే ఇలా చేయండి

Advertisement

తాజా వార్తలు

Advertisement