Saturday, April 20, 2024

దేశంలో భారీగా తగ్గిన కరోనా మరణాలు.. కొత్త కేసులు ఎన్నంటే..

భారత్​లో కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. కొత్తగా.. 38,949 మందికి వైరస్​ సోకింది. వైరస్ బారిన పడి మరో 542 మంది ప్రాణాలు విడిచారు. కొత్తగా 40,026 మంది వైరస్​ను కోలుకున్నారు. మరణాల సంఖ్య భారీగా తగ్గడం ఊరటనిచ్చే విషయం. 101 రోజుల కనిష్టానికి కోవిడ్ మరణాలు చేరుకున్నాయి. భారత్‌లో మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,10,26,829కి చేరింది. వీరిలో ఇప్పటి వరకు 3,01,83,876 మంది కోలుకున్నారు. కోవిడ్ బారినపడి 4,12,531 మంది మరణించారు. ప్రస్తుతం మన దేశంలో 4,30,422 యాక్టివ్ కేసులున్నాయి.  ఇప్పటి వరకు 44,00,23,239 టెస్ట్‌లు చేశారు. ఇప్పటి వరకు 39.53 కోట్ల డోసుల వ్యాక్సిన్ వేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement