Thursday, April 25, 2024

ఏపీలో కరోనా వ్యాప్తి… కొత్త కేసులు ఎన్నంటే…

ఏపీలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. గడచిన 24 గంటల్లో 49,568 కరోనా పరీక్షలు నిర్వహించగా 1,125 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 210 కొత్త కేసులు నమోదు కాగా.. అత్యల్పంగా కర్నూలు జిల్లాలో ఒక పాజిటివ్ కేసును గుర్తించారు. నెల్లూరు జిల్లాలో 184, కృష్ణా జిల్లాలో 164, పశ్చిమ గోదావరి జిల్లాలో 161, ప్రకాశం జిల్లాలో 110 కేసులు నమోదు అయ్యాయి. గడిచిన 24 గంటల్లో 1,356 మంది కరోనా నుంచి కోలుకోగా.. రాష్ట్రవ్యాప్తంగా తొమ్మిది మంది మృతి చెందారు. కోవిడ్ తో కృష్ణా జిల్లాలో ముగ్గురు, పశ్చిమగోదావరిలో ఇద్దరు, తూర్పుగోదావరి, గుంటూరు, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున ప్రాణాలు కోల్పోయారు. తాజా మరణాలతో రాష్ట్రంలో ఇప్పటి వరకు మరణించిన వారి సంఖ్య 14,019కి పెరిగింది. రాష్ట్రంలో ఇప్పటిదాకా 20,31,974 పాజిటివ్ కేసులు నమోదు కాగా…ఇందులో 20,03,543 మంది ఆరోగ్యవంతులయ్యారు. ప్రస్తుతం రాష్ట్రంలో 14,412 యాక్టివ్ కేసులు ఉన్నాయి.

ఇది కూడా చదవండిః వాడిని కచ్చితంగా ఎన్ కౌంటర్ చేస్తాం: మంత్రి మల్లారెడ్డి సంచలన ప్రకటన

Advertisement

తాజా వార్తలు

Advertisement