Thursday, April 25, 2024

Corona: కరోనా కోరల్లో హైదరాబాద్.. అపార్ట్‌మెంట్‌లో 10 మందికి వైరస్

తెలంగాణలో కరోనా మహమ్మారి మరోసారి విజృంభిస్తోంది. గత కొద్ది రోజులుగా కేసులు సంఖ్య క్రమంగా పెరుగుతున్నాయి. తాజాగా హైదరాబాద్‌ రాజేంద్రనగర్‌ పరిధిలోని పీరంచెరువులో ఉన్న ఓ అపార్ట్‌మెంట్‌లో 10 మంది కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ కావడం కలకలం రేపుతోంది. ఆ అపార్ట్‌మెంట్‌కు చెందిన ఓ వ్యక్తి ఇటీవల ఢిల్లీకి వెళ్లి హైదరాబాద్ కి తిరిగి వచ్చాడు. దీంతో అతని ద్వారా అపార్ట్ మెంట్ లోని మిగితా వారికి కరోనా సోకినట్లు అధికారులు ప్రాథమిక నిర్థారణకు వచ్చారు. ఒకే అపార్ట్ మెంట్ లో 10 మందికి కరోనా సోకడంతో స్థానిక ప్రజలు భయాందోళన చెందుతున్నారు.

తెలంగాణలో నిన్న 213 మందికి పాజిటివ్ అని నిర్ధారణ అయింది. అత్యధికంగా జీహెచ్ఎంసీ పరిధిలో 72 కొత్త కేసులు నమోదయ్యాయి. రంగారెడ్డి జిల్లాలో 21, సంగారెడ్డి జిల్లాలో 20, కరీంనగర్ జిల్లాలో 13 కేసులు వెల్లడయ్యాయి. అదే సమయంలో 156 మంది కరోనా నుంచి కోలుకోగా, ఒకరు మరణించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 6,76,787 పాజిటివ్ కేసులు నమోదు కాగా, 6,69,010 మంది ఆరోగ్యవంతులయ్యారు. తెలంగాణలో  కరోనాతో 3,998 మంది మృతి చెందారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement