Tuesday, March 26, 2024

కొత్త‌గా – వెయ్యి క‌రోనా కేసులు

క‌రోనా మ‌హ‌మ్మారి త‌గ్గుముఖం ప‌డుతోంది. కాగా గ‌డ‌చిన 24 గంట‌ల్లో దేశంలో 1,007 కొత్త క‌రోనా కేసులు న‌మోద‌య్యాయి. అదే స‌మ‌యంలో 818 మంది కరోనా నుంచి పూర్తిగా కోలుకున్నారు. వెర‌సి రిక‌వ‌రీ రేటు 98.76 శాతంగా న‌మోదు కాగా.. యాక్టివ్ కేసుల శాతం 0.03 శాతానికి త‌గ్గిపోయింది. ప్ర‌స్తుతం దేశ‌వ్యాప్తంగా 11,058 మంది చికిత్స తీసుకుంటున్నారు. ఇక గ‌డ‌చిన 24 గంట‌ల వ్య‌వ‌ధిలో కోవిడ్ కార‌ణంగా 26 మంది చ‌నిపోయారు. తాజాగా న‌మోదైన కొత్త కేసుల‌తో దేశంలో ఇప్ప‌టిదాకా న‌మోదైన మొత్తం కేసుల సంఖ్య 4,30,39,025కు చేరుకోగా.. మ‌ర‌ణాల సంఖ్య 5,21,736కు చేరుకుంది. ఇక క‌రోనా బారిన ప‌డి రిక‌వ‌రీ అయిన వారి సంఖ్య 4,25,02,454కు చేరుకుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement