Thursday, April 25, 2024

ఏపీలో కరోనా వైరస్ దండయాత్ర

ఏపీలో కరోనా కేసులు భారీగా నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో ఏపీలో 31,072 కరోనా పరీక్షలు నిర్వహించగా 1,730 మందికి పాజిటివ్ అని తేలింది. అత్యధికంగా గుంటూరు జిల్లాలో 378 కొత్త కేసులు నమోదయ్యాయి. చిత్తూరు జిల్లాలో 338, విశాఖ జిల్లాలో 235, కృష్ణా జిల్లాలో 226, నెల్లూరు జిల్లాలో 164, ప్రకాశం జిల్లాలో 81, అనంతపురం జిల్లాలో 59, శ్రీకాకుళం జిల్లాలో 58, కర్నూలు జిల్లాలో 54, కడప జిల్లాలో 54, విజయనగరం జిల్లాలో 46, తూ.గో. జిల్లాలో 27, ప.గో. జిల్లాలో 10 మందికి కరోనా సోకినట్టు గుర్తించారు. గత 24 గంటల్లో 842 మంది కరోనా నుంచి కోలుకోగా చిత్తూరులో ముగ్గురు, నెల్లూరు, విశాఖ జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున కరోనాతో మరణించారు. ఏపీలో ఇప్పటివరకు 9,07,676 పాజిటివ్ కేసులు నమోదు కాగా 8,90,137 మంది కరోనా నుంచి కోలుకున్నారు. అటు యాక్టివ్ కేసుల సంఖ్య కూడా 10,300గా నమోదైంది. కరోనా మరణాల సంఖ్య 7,239గా ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement