Wednesday, April 24, 2024

క‌రోనా కేసుల అప్ డేట్స్ : పెరుగుతోన్న ఒమిక్రాన్ కేసులు

క‌రోనా వ్యాపిస్తున్న నేప‌థ్యంలో దేశంలో కొత్త‌గా 7,145కేసులు న‌మోద‌య్యాయి. ఒక్క‌రోజులో 8,706మంది క‌రోనా నుంచి కోలుకున్నార‌ని కేంద్ర వైద్య ఆరోగ్య‌శాఖ బులిటెన్ లో వివ‌రించింది. నిన్న దేశంలో 289 మంది క‌రోనా వ‌ల్ల ప్రాణాలు కోల్పోయారు.దేశంలో క‌రోనా యాక్టివ్ కేసుల సంఖ్య‌ 569 రోజుల క‌నిష్ఠానికి చేరింది. ప్ర‌స్తుతం ఆసుప‌త్రులు, హోం క్వారంటైన్ల‌లో 84,565 మంది చికిత్స తీసుకుంటున్నారు. క‌రోనా నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు కోలుకున్న వారి సంఖ్య‌ 3,41,71,471కు పెరిగింది. అలాగే మృతుల సంఖ్య మొత్తం 4,77,158కు చేరిందని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. ఇక ఇప్ప‌టివ‌ర‌కు మొత్తం వినియోగించిన‌ వ్యాక్సిన్ డోసుల సంఖ్య‌ 136,66,05,173కు చేరింది. ఓ ప‌క్క ఒమిక్రాన్ కేసుల సంఖ్య కూడా పెరుగుతుంది. ఈ నేప‌థ్యంలో ప్ర‌జ‌లు అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని తెలిపారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement