Thursday, April 18, 2024

ఏపీలో మళ్లీ పెరుగుతున్న రోజువారీ కేసులు

ఏపీలో కరోనా మహమ్మారి మళ్లీ విజృంభిస్తోంది. రోజువారీ కరోనా కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతున్నాయి. గడచిన 24 గంటల్లో 67,911 కరోనా పరీక్షలు నిర్వహించగా 1,608 పాజిటివ్ కేసులు నమోదైయ్యాయి.  1,107 మంది కరోనా నుంచి కోలుకోగా.. ఆరుగురు మరణించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 20,27,650 పాజిటివ్ కేసులు నమోదు కాగా… 19,98,561 మంది ఆరోగ్యవంతులయ్యారు. ప్రస్తుతం రాష్ట్రంలో 15,119 యాక్టివ్ కేసులున్నాయి. కరోనా కారణంగా ఇప్పటి వరకు మృతుల సంఖ్య 13,970కి పెరిగింది.

కాగా, తాజాగా నమోదైన కేసుల్లో అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 281 మందికి కరోనా నిర్ధారణ కాగా, నెల్లూరు జిల్లాలో 261, తూర్పు గోదావరి జిల్లాలో 213, కృష్ణా జిల్లాలో 161, పశ్చిమ గోదావరి జిల్లాలో 154 కేసులు గుర్తించారు. అత్యల్పంగా విజయనగరం జిల్లాలో 14 కేసులు వెల్లడయ్యాయి.కోవిడ్ తో నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో ఇద్దరు చొప్పున, విశాఖ, పశ్చిమగోదావరి జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున మృతి చెందారు.  

ఇది కూడా చదవండిఃటీఆర్పీల్లో దూసుకుపోతున్న మీలో ఎవరు కోటీశ్వరులు

Advertisement

తాజా వార్తలు

Advertisement