Thursday, April 25, 2024

కరోనా పేషెంట్లపై జీఎస్టీ భారం.. టెస్టుల నుంచి ఆక్సిజన్ దాకా..!!

దేశవ్యాప్తంగా కరోనా పేషెంట్లపై జీఎస్టీ భారంగా మారింది. కరోనా టెస్టుల నుంచి ఆక్సిజన్ వరకు అన్నింటిపైనా జీఎస్టీ భారంతో సామాన్యులు సతమతం అవుతున్నారు. ఆసుపత్రిలో చేరినప్పటి నుంచి డిశ్చార్జ్ అయ్యే దాకా కరోనా పేషెంట్ అదనపు భారాన్ని మోయాల్సి వస్తోంది. జీఎస్టీ కారణంగా ఆసుపత్రి బిల్లుపై 15 శాతం 20 శాతం దాకా ఎక్కువ చెల్లించాల్సి వస్తోంది.

12 శాతం జీఎస్టీ అమలవుతున్న కరోనా పరికరాలు:

★ మెడికల్ ఆక్సిజన్
★ మెకానికల్ విడిభాగాలు, ఫిల్టర్లున్న మాస్కులు
★ చేతికి వేసుకునే రబ్బర్ గ్లోవ్స్
★ కరోనా టెస్ట్ కిట్లు, రీ–ఏజెంట్లు
★ వెంటిలేటర్లు, శ్వాస పరికరాలు
★ రక్షణ కోసం కళ్లకు పెట్టుకునే అద్దాలు
★ బ్యాండేజీలు, శస్త్రచికిత్సకు వాడే పరికరాలు

18 శాతం జీఎస్టీ అమలవుతున్నవి:

★ శానిటైజర్లు, హ్యాండ్ వాష్ లు, డిసిన్ ఫెక్టెంట్లు, సబ్బులు
★ టిష్యూ పేపర్లు, న్యాప్కిన్లు, వ్యర్థాలు వేసే కవర్లు
★ వస్త్రంతో చేసిన గ్లోవ్స్ , సెల్యులోజ్ ఫైబర్ తో చేసిన మాస్క్ లు, తలకు వాడే నెట్‌లు
★ స్టెరిలైజేషన్ కోసం వాడే ఇథైల్ ఆల్కహాల్
★ రోగుల నుంచి ద్రవాలు సేకరించే శానిటరీ వేర్
★ ల్యాబ్ పరికరాలు, థర్మామీటర్లు, సైకోమీటర్లు, హైగ్రోమీటర్లు, క్యాలిబరేటింగ్ మీటర్లు

Advertisement

తాజా వార్తలు

Advertisement