Saturday, April 20, 2024

కొత్త‌గా 6,422క‌రోనా కేసులు-14మంది మృతి

నేడు కొత్త‌గా 6,422క‌రోనా కేసులు న‌మోద‌య్యాయి..14మంది మృతి చెందారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 4,45,16,479కి చేరింది. ఇందులో 4,39,41,840 మంది కోలుకోగా, 5,28,250 మంది మృతిచెందారు. మరో 46,389 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. కాగా, గత 24 గంటల్లో 5,748 మంది కరోనా నుంచి బయటపడ్డారని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. రెండు రోజులు కరోనా కేసులు పెరుగుతుండటంతో రోజువారీ పాజిటివిటీ రేటు 2.04 శాతానికి పెరిగిందని తెలిపింది. ఇక మొత్తం కేసుల్లో 0.10 శాతం కేసులు యాక్టివ్‌గా ఉన్నాయని, రికవరీ రేటు 98.71 శాతం, మరణాలు 1.19 శాతంగా ఉన్నాయని పేర్కొన్నది. ఇప్పటివరకు 215.98 కోట్ల కరోనా వ్యాక్సిన్‌ డోసులను పంపిణీ చేశామని, బుధవారం ఒక్కరోజే 31,09,550 మందికి వ్యాక్సిన్‌ ఇచ్చామని వెల్లడించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement